ఎన్నో ఏళ్లుగా నా కళ్ళలో కుంకుడుకాయ రసంలా ఎంతో భారంగా ఉన్న మా అక్క పెళ్లి ఈ మధ్యనే అయింది. ఈ మధ్యనే అంటే ఎలక్ట్రానిక్ మధ్యనే అని కాదు. కొన్నాళ్ల క్రితం అయింది. దాంతో నా బాధ్యతా తీరింది. ఇక నాకు లైన్ క్లియర్.
అసలు పెళ్ళే వద్దన్నది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సరే. ఇంతకీ పెల్లెప్పుడైన్దంటారా? ఈ ఫిబ్రవరి 27 న విజయవాడలో. తరువాత మేమందరం కంచి వెళ్ళాం. అది మా నాయనమ్మ సొంతవూరు.
చాలా కాలానికి ఇండియా కి వచ్చానన్న సంతోషం ఒక ప్రక్క, అక్క కి పెళ్ళి వెళ్లి పోతుందనే బాధ మరో పక్కా, మంచి కుటుంబంలోకి వేల్తోండానే ఆనందం ఇంకోవైపూ... ఇలా ఇదంతా mixed emotions. మొత్తానికీ నా స్టైల్ లో ఏడవకుండా (నాకు ఏడుపంటే యాక్.) ఎలాగోలా (అబ్బ. గోలంటే గోల కాదండీ బాబూ. ఎలాగో అలాగా) నడిపించి మొత్తానికీ కుంకుడు కాయ రసం కదిగేసుకున్నాను.
మామూలుగా పెళ్ళంటే... బంధువులూ, ఫ్రెండ్సూ వస్తారు. కానీ ఈ సారి కొత్తదనం (మిస్సయిందనుకొండీ) తెలిసిన బ్లాగర్లని పిలవటం. మాకు ఎవరూ అంతగా తెలియదు. రాసేదే తక్కువ. చూసేది ఎవరు? అంటే ఏమిచేయగలం? నవ్వుకోవటం తప్ప.
అందుకే నేను సీనియర్ బ్లాగర్ జ్యోతికి తెలియజేశాను. (సారీ జ్యోతి గారు). వారు ఎంతో వేగంగా స్పందించి అక్కకి ఆశీస్సులు, విషెస్ అందించారు. అందుకు కృతజ్ఞతలు.
ఇంతలో అక్క క్లాస్ మేట్ ప్రీతీ కతియా వచ్చింది. వాళ్ల అన్నయ్యతో కలసి. దాంతో అక్కకి గీతాచార్య గారు గుర్తుకు వచ్చి ప్రీతీ చేత ఆయనకీ ఫోను చేయించింది. (ఆయన ప్రీతీ గారి ఫ్రెండ్ ట. ఒకసారి ఆయనని అక్క వాళ్ల ఇంట్లోనే accidental గా మీట్ అయిందట. శుభలేఖ పంపిందనుకోండి). internal exams హడావిడిలో ఉండి రాలేక పోతున్నానని చెప్పి ఫోనులోనే శుభాకాంక్షలు చెప్పారు. బావగారు కూడా ఫోనులో మాటాడితే ముందు చెప్పి ఉంటే వంటల పుస్తకం పంపేవాడిని అని జోక్ చేశారు.
ప్రీతీ వాళ్ళకి మా అయ్యంగార్ల పెళ్లి బాగా నచ్చిందని అన్నారు. అన్నీ సంప్రదాయప్రదంగా జరిగినా ఎవరికీ బోరు లేకుండా బాగా సరదాగా జీవితాంతం గుర్తు ఉండేలా జరిగింది. అలా నా బాధ్యత అంతా తీర్చుకుని ఊపిరిపీల్చుకున్నాను.
మా సంప్రదాయం ప్రకారం ముందుగా కంచి వరదరాజ పెరుమాళ్ ఆశీస్సులకోసం మరునాడే కంచి వెళ్ళాం. అక్కడో చిన్న సర్ప్రైజ్ ఎదురైంది. మా బ్లాగు గురించి సెప్టెంబర్ 25 న ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు ఎవరో మా బ్లాగులోనే ఎవరో చెప్పారు. దాని గురించి మాకు బాగా ఆలస్యంగా తెలియటంతో మాకు ఆ పేపరు దొరకలేదు.
మేము కంచికి బయలుదేరి వెళ్ళే సమయంలో ప్రీతీ వాళ్ల అన్నయ్య వచ్చి అక్కకని ఒక చిన్న కవర్ ఇచ్చారు. అందులో ఒక పేపర్ ఉంది. అది మా బ్లాగు గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్ ఫొటోస్టాట్. దాని మీద విత్ బెస్ట్ విషెస్ ఫ్రం గీతాచార్య అని ఉంది. మాకు ఆశ్చర్యం.
"నిన్న కాలేజీ నుంచీ వచ్చాక లైబ్రరీకి వెళ్తే అక్కడ ఐడియా వచ్చి ఫొటోస్టాట్ తీసి మా విని చేత పంపాడు. వాడికి అది అలవాటే. సడన్గా సర్ప్రైజ్ చేస్తాడు." అని వెళ్లి పోయారు.
మాకూ ఎన్ని చదివింపులు వచ్చినా, ఎందరు ఎన్ని గిఫ్ట్ లు ఇచ్చినా ఇది మాత్రం నిజంగానే ఒక సడన్ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎందుకంటే దానిలో మెన్షన్ చేసింది మా నాన్న గారి గురించి రాసిన టపా గురించి. అందుకు వారికి బ్లాగ్ముఖం గా కృతజ్ఞతలు.
అలా ఎన్నో ఆనందాలని అందించి, నా బాధ్యతని తీరిన (చేసిందంతా వాళ్ల నాన్నే అయినా దగ్గర ఉంది చేయించింది (అల్లరి) అంతా నేనేగా. ;-)) ఆ రోజుని నేను ఎప్పటికీ మరువలేను.
పెళ్ళిలో జరిగిన సందడీ, కంచి విశేషాలూ మరో టపాలో.
ప్రియ అయ్యంగార్.
మిగిలిన ప్రశ్న
-
రాలు పూలలో రాలిన ఆశలు
వాలు కనులలో రంగుల కలలు
చూడని కన్ను ఏది?
కదలని కాలంలో రేయి నిట్టూర్పులు,
వదలని మోహంలో వేయి వేడుకలు
కాంచని హృది ఏది?
నివురుకమ్మిన వేకు...
7 hours ago











1 వ్యాఖ్యలు:
శుభాకాంక్షలు.
Post a Comment